మల్యాల మండలంలో బుధవారం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నారు. కళ్యాణ మహోత్సవంలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి, వేదమంత్రోత్సవాల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నారు.