హైదరాబాద్లోని ఓ హోటల్లో కస్టమర్లు మిగిల్చిన చట్నీని వేరే వారికి పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. బేగంపేట్లోని మెజ్బాన్ హోటల్లో కస్టమర్లు మిగిల్చిన గ్రీన్ చట్నీ, టొమాటో సాస్ మళ్లీ ఒక బౌల్లో వేసి మరుసటి రోజుకు రెస్టారెంట్ సిబ్బంది వాడుతున్నారంటూ musicofarun అనే యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.