బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. మండలంలోని నీలోజుపల్లి, వెంకటరావుపల్లి కొత్తపేట, దేశయిపల్లి, విలాసాగర్ తో పాటు మండలకేంద్రంలోని రామాలయంలో శ్రీ సీత రాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస చార్యులు ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.