నాలుగో దశ లోక్సభ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ దశలో 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 96 లోక్సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. ఏపీలో 25 సీట్లు, తెలంగాణలో 17 సీట్లు, యూపీలో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్లో 8 సీట్లు, బిహార్లో 5, జార్ఖండ్, ఒడిశాలలో 4 సీట్లు, జమ్మూకశ్మీర్లోని ఒక్క సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.