మట్టి గణపతులను పూజించాలి : నరేందర్ రెడ్డి

53చూసినవారు
మట్టి గణపతులను పూజించాలి : నరేందర్ రెడ్డి
గణపతి పూజ చాలా పవిత్రమైనదని మరియు సకల శుభాలను ప్రసాదించేదని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో వేద బ్రాహ్మణులు వేద మంత్రాల మధ్య పండుగ వాతావారణాన్ని తలపించే విధంగా వినాయక చవితిని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ముందస్తు వినాయకచవితి ఉత్సవాలను శాస్త్రోత్తంగా వేదమంత్రాలతో జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. వారు మాట్లాడుతూ పండుగలలో వినాయచవితికి ప్రత్యేకత ఉన్నదని మరియు చవితి పండుగ ఎంతో గొప్పదన్నారు. ప్రజలందరూ పర్యావరణహితంగా మెలగాలని మరియు పర్యావరణ పరిరక్షణే ప్రధాన విధిగా భావించి ముందుకు సాగాలని కోరారు. మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులకు సూచించారు.

సంబంధిత పోస్ట్