పెగడపల్లి మండలంలోని నామాపూర్ కు చెందిన రైతు సిలివేరు తిరుపతి(43) సోమవారం ఉదయం తన ట్రాక్టర్తో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ కిందపడ్డాడు. దీంతో తలకు, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం కరీంనగర్ కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు.