ప్రధాని మోడీపై బీజేపీ మాజీ ఎంపీ విమర్శలు

6962చూసినవారు
ప్రధాని మోడీపై బీజేపీ మాజీ ఎంపీ విమర్శలు
ప్రధాని నరేంద్ర మోడీపై బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ పూజలో కూర్చోవడంపై సుబ్రమణియన్ స్వామి విమర్శించారు. పూజలో కూర్చోవడానికి ప్రధాని మోడీకి ఎలాంటి అర్హత ఉందని ప్రశ్నించారు. వ్యక్తిగత జీవితంలో మోడీ రాముడిని ఆచరించలేదన్నారు. తన భార్య విషయంలో రాముడి సిద్ధాంతాలు పాటించలేదన్నారు.

సంబంధిత పోస్ట్