వైసీపీ చేసిన అభివృద్ధి చూడటానికి సిద్ధంగా ఉన్నాం: షర్మిల

302580చూసినవారు
వైసీపీ చేసిన అభివృద్ధి చూడటానికి సిద్ధంగా ఉన్నాం: షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ను స్వీకరించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూడటానికి తాను సిద్ధమని ప్రకటించారు. డేట్, టైమ్ మీరు చెప్పినా.. మమ్మల్ని చెప్పమన్నా సరే అన్నారు. రాజధాని లేకుండా నాలుగేళ్లు పాలించిన ఘనత వైసీపీదే అని అన్నారు. జగన్ రెడ్డి అంటే వైసీపీ నేతలకు ఇబ్బందిగా ఉంటే.. జగనన్నా అని పిలుస్తా అని కౌంటర్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్