రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో శనివారం ఉదయం ఓ కారు అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీ కొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈ కారులో ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి చెందిన భార్యా భర్తలు ప్రయాణిస్తున్నారు. తీవ్రంగా గాయడిన వీరిని అంబులెన్సులో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భర్త మహేశ్ మృతి చెందాడు.