కోనేరులో కప్పల కలేబరాలు

3996చూసినవారు
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో గల కోనేరులో ఆదివారం కప్పల కలేబరాలు కనిపించాయి. ఆంజనేయ స్వామి దీక్షాపరులు కోనేట్లో స్నానానికి దిగడంతో దుర్వాసన వేయడంతో వారు స్నానం చేయకుండానే వెనుదిరిగారు. ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యం, ఈవో పర్యవేక్షణ లోపంతో ఆలయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుని భక్తుల మనోభావాలు దెబ్బ తింటున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్