వైసీపీ అధినేత, సీఎం జగన్కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 3న పూతలపట్టు వేదికగా జరిగిన 'మేమంతా సిద్ధం' సభలో ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఈసీ.. సీఎంకు నోటీసులు ఇచ్చింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది.