మండలాల వారీగా ప్రభుత్వ భూమిని గుర్తించాలి

69చూసినవారు
మండలాల వారీగా ప్రభుత్వ భూమిని గుర్తించాలి
మండలాల వారీగా ప్రభుత్వ భూమిని గుర్తించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అన్నారు. ఐడివోసి సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాలోని తహసీల్ధార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి సమస్యలు, ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలన్నారు. ప్రతి మండల భూమి వివాదాలు, కోర్టు కేసుల్ని ఎప్పటికపుడు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్