జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా దీక్ష విరమణ కోసం హనుమాన్ మాలధారులు, భక్తులు భారీగా తరలివస్తుండటంతో రామనామస్మరణలో కొండగట్టు మారుమోగిపోతోంది. కొండపైకి చేరేందుకు ఆర్టీసీ 4 ఉచిత బస్సులు నడుపుతోంది