జగిత్యాల: భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

59చూసినవారు
జగిత్యాల: భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
ప్రభుత్వ భూముల సర్వే పకడ్బందీగా చేయాలని జగిత్యాల కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశించారు. రాయికల్‌ పట్టణంలోని ప్రభుత్వ భూములను జగిత్యాల ఆర్డీవోతో కలిసి పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌కు శనివారం సూచించారు. రోజూ ఎల్‌ఆర్‌ఎస్‌లో ఎన్ని దరఖాస్తులను పరిష్కరిస్తున్నారనే విషయాలను ఎప్పటికప్పుడు నివేదికను ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు.

సంబంధిత పోస్ట్