గంజాయి నిర్మూలించాలని ఎస్పీకి జెడ్పీ చైర్ పర్సన్ వినతి

540చూసినవారు
గంజాయి నిర్మూలించాలని ఎస్పీకి జెడ్పీ చైర్ పర్సన్ వినతి
గంజాయి సరఫరాను అరికట్టేందుకు పోలీస్ ఆధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత కోరారు. ఈ మేరకు జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ కు జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం మహిళా ప్రజా ప్రతినిధులతో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎంపీపీ ములాసపు లక్ష్మీ, కౌన్సిలర్లు వొద్ది శ్రీలత, ప్రేమలత, ఎంపీటీసీ రెడ్డి రత్న, మాజీ సర్పంచ్లు స్వప్న రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్