డిజిటల్ చెల్లింపులకు అవకాశం: మున్సిపల్ కమిషనర్

61చూసినవారు
డిజిటల్ చెల్లింపులకు అవకాశం: మున్సిపల్ కమిషనర్
మెట్ పల్లిలోని ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కమిషనర్ మోహన్ తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ సహకారంతో డిజిటల్ లావాదేవీలు నిర్వహించొచ్చని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు మున్సిపాలిటీకి అందజేసిన 11 హ్యాండ్ హెల్డ్ మిషన్స్ ను కమిషనర్ సోమవారం బిల్ కలెక్టర్ లకు అప్పగించారు. ఇకపై ప్రజలు కార్డు, యూపీఐ పేమెంట్స్, క్యాష్, క్యూఆర్ కోడ్ తో సైతం మున్సిపల్ బిల్లులు, బకాయిలు చెల్లించవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్