మెట్ పల్లి మండలం అల్లూరి సీతరామరాజు తండా పరిధిలో గురువారం పేకాట ఆడుతున్న స్థావరం పై పోలీసులు దాడి చేయడం జరిగింది. పేకాట ఆడుతున్న 14 మందిలో ఐదుగురిని అరెస్ట్ చేయగా, మిగత 9 మంది పరారీలో ఉండడం జరిగిందని ఎస్ఐ చీరంజీవి తెలిపారు. నిందితుల నుండి 8 వేల నగదు, 5 సెల్ ఫోన్లు, 9 మోటర్ వెహికిళ్ళు జప్తు చేసి కేసు నమోదు చేసినట్టు తెలిపారు.