పాఠశాల అదనపు గది నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

63చూసినవారు
పాఠశాల అదనపు గది నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
మానకొండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నో మాన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సైన్స్ ల్యాబ్ గది నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్