శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల జిపిల ఎదుట జీపీ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల పంచాయతీలో సెక్రటరీ వేధింపులు భరించలేక జీపీ కార్మికుడు ప్రసాద్ పురుగుల మందు తాగాడని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. జీపీ కార్మికులపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని సీఐటీయూ మండల నాయకుడు సారయ్య ఆరోపించారు. ప్రభుత్వం ప్రత్యేక వైద్యం అందించాలని, కార్యదర్శిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.