గడ్డం వంశీకి మద్దతుగా ప్రచారం

83చూసినవారు
ముత్తారం మండలం పోతారం గ్రామంలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుద్దిల్ల శ్రీను బాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్