ఆదివరాహస్వామి సన్నిధిలో భక్తుల సందడి

57చూసినవారు
ఆదివరాహస్వామి సన్నిధిలో భక్తుల సందడి
కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆదివరాహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం స్వామివారిని వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. ప్రధాన పూజారి రామానుజ చార్యులు ఆధ్వర్యంలో అభిషేకం పూజలు నిర్వహించారు. నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ ఈవో కాంత రెడ్డి ఏర్పాట్లను చేశారు.

సంబంధిత పోస్ట్