సర్వే పేరిట ఆశ వర్కర్లపై వేధింపులు ఆపాలి

85చూసినవారు
సర్వే పేరిట ఆశ వర్కర్లపై వేధింపులు ఆపాలి
ఆశా వర్కర్లను వయోజన బీసీజీ సర్వే చేయాలని అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆశా వర్కర్స్ యూనియన్- సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ వేధింపులు ఇలాగే కొనసాగితే ఆశా వర్కర్లు మిగతా విధులు కూడా బంద్ చేస్తారని హెచ్చరించారు. ధర్నాలో రమాదేవి, జ్యోతి, రేణుక, స్వరూప, రాజేశ్వరి కృష్ణవేణి, స్వప్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్