వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

542చూసినవారు
వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
వేసవి కాలంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత క్రీడా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్జీ- 3, ఏపిఏ జీఎం సుధాకర్ రావు గురువారం తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే వేసవి శిక్షణలో భాగంగా 18 ఏళ్లలోపు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఈనెల 29 నుంచి 25 రోజులపాటు స్థానిక రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో వాలీబాల్, ఫుట్ బాల్, ఆర్చరీ, హాకీ క్రీడల్లో ఉచిత శిక్షణ ఉంటుందని, 28లోపు నమోదు చేయించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్