మహిళపై లైంగికదాడికి పాల్పడి, అనంతరం హత్య చేసిన నిందితులను కూకట్పల్లి పోలీసులు గురువారం ఆరెస్టు చేశారు. కూకట్పల్లి పీఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. ఈ నెల 21న తెల్లవారు జామున కూకట్పల్లి వై జంక్షన్లోని ఓ భవనం సెల్లారులో గుర్తు తెలియని మహిళ(45)పై ఇద్దరు యువకులు లైంగికదాడి చేసి, హత్య చేశారు. నిందితులు బీహార్కు చెందిన నితీష్ కుమార్, మరో నిందితుడు మైనర్ అని తెలిపారు.