వైద్య శిబిరం

78చూసినవారు
వైద్య శిబిరం
ముత్తారం మండలం మైదం బండ గ్రామంలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 61 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 20 మంది రక్త నమూనాలు సేకరించారు. అలాగే బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ లలితాదేవి, సూపర్ వైజర్ లక్ష్మి, శోభారాణి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్