సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన బొంగోని అజయ్ (23 ) అనే యువకుడు వ్యాన్ ఢీకొని మృతిచెందాడు. కనుకుల నుండి సుల్తానాబాద్ వైపు బైక్ పై వస్తుండగా, కనుకుల వైపు వెళుతున్న డిసిఎం వ్యాన్ సుద్దాల పెట్రోల్ పంప్ సమీపంలో ఎదురెదురుగా ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.