ఎమ్మార్పీఎస్- టీఎస్ రాష్ట్ర ఉపాద్యక్షులుగా కన్నూరి బాబు, పెద్దపల్లి జిల్లా ఇంచార్జీగా కొట్టెపల్లి దుర్గాప్రసాద్, మంథని నియోజకవర్గ ఇన్ చార్జిగా కొయ్యల మొండిని నియమించినట్లు రాష్ట్ర అద్యక్షుడు మేడి పాపయ్య ప్రకటించారు. సోమవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా నియమించిన వారికి పాపయ్య నియామక పత్రాలను అందజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా అద్యక్షులు పెరుక నవీన్ పాల్గోన్నారు.