ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ, ఎమ్మెల్యే

59చూసినవారు
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ, ఎమ్మెల్యే
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావులు అన్నారు. మంగళవారం కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన జీపీ ఉద్యోగి పవన్, కునారంలో మత్స్యకారుడు కుమార్ ఇద్దరు వరదల్లో చిక్కుకొని మృతి చెందడంతో ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులు బాధిత కుటుంబాలకు వారు అందజేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్