అమరవీరుల స్తూపం ముందు నిరసన

65చూసినవారు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు అమరవీరుల స్తూపం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్ లు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మతోన్మాద పాలనను అంతమొందించాలంటే ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు అశోక్, బాబా, బాలకృష్ణ, రాజన్న, రవి, కొమురయ్య, పోచన్న పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్