పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ రైల్వే గేట్ దగ్గర చదువుల తల్లి సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే 193 వ జయంతి సందర్భంగా కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్. వారు మాట్లాడుతూ సావిత్రిబాయి మహిళల హక్కుల కోసం, బాలికల విద్యా కోసం, సమ సమాజ స్థాపనకు చేసిన కృషి మనందరికీ ఆదర్శం అని మహిళా సాధికారత దిశగా వారి సేవలు చిరస్మరణీయం అన్నారు.