గోదావరిఖని లో మూతపడిన సింగరేణి పాత బిల్డింగ్ ని పూర్తిస్థాయిలో గురువారం సింగరేణి సిఎండి బలరాం నాయక్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ విజ్ఞప్తి మేరకు పారిశ్రామిక ప్రాంతంలో పరిశీలించారు. యువతకు ఉపాధి చూపే విధంగా స్కిల్ డెవలప్మెంట్ పై సహాయ సహకారాలు అందిస్తామని బలరాం నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ కె శ్రీనివాస్, జిఎం చింతల శ్రీనివాస్, ఇతర అధికారులు, నాయకులు పాల్గోన్నారు.