800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తాం: భట్టి

52చూసినవారు
800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తాం: భట్టి
రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన రామగుండంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక్కడి ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ జెన్ కో, సింగరేణి సంయుక్తంగా రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మిస్తాయని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్