విద్యార్థులకు కావాల్సిన వసతులన్ని కల్పించాలి

54చూసినవారు
విద్యార్థులకు కావాల్సిన వసతులన్ని కల్పించాలి
ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లలో విద్యార్థులకు కావాల్సిన వసతులు అన్ని కల్పించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లాలోని వసతి గృహ భవనాల యజమానులు, విద్యాలయాల ప్రిన్సిపాళ్లతో కలెక్టరేట్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా వసతి గృహాల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు? ఎన్ని గదులు ఉన్నాయి? టాయిలెట్స్, కిచెన్ ఇతర సదుపాయాలను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్