అమ్మవారి సేవలో ఎమ్మెల్యేలు

78చూసినవారు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యేలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలసి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చల్లని చూపుతో వర్షాలు సకాలంలో కురిసి ప్రజలు రైతులు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్