టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పావో నుర్మి గేమ్స్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఫిన్లాండ్లో జరిగిన టోర్నీలో జావెలిన్ను ఏకంగా 85.97 మీటర్లు విసిరి సత్తా చాటారు. ఎనిమిది మంది అథ్లెట్లు పాల్గన్న ఈ ఈవెంట్లో తన మూడో ప్రయత్నంలో నీరజ్ 85.97 మీటర్ల త్రోతో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు.