ముస్తాబైన కళ్యాణ వేదిక

57చూసినవారు
శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనున్నది. ఈ నేపథ్యంలో కళ్యాణ వేదిక ప్రత్యేకమైన పుష్పాలతో శోభయమానంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. శ్రీరామ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్