నూతన దేవాదాయశాఖ కమిషనర్ యం. హన్మంతరావుకు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ప్రసాదాన్ని ఆలయ ఈఓ డి. కృష్ణ ప్రసాద్ శనివారం హైద్రాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి అందజేశారు. ముందుగా కమిషనర్ ను సన్మానించారు. వారి వెంట వేద పండితులు, ఆలయ పర్యవేక్షకులు నాగుల మహేష్, సిసి ఎడ్ల శివ సాయి ఉన్నారు.