కోనరావుపేట మండలం వట్టి మల్ల గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో మంగళవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌడ సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆ తల్లి దీవెనలతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.