ఫుడ్ కలర్స్‌పై నిషేధం విధించిన కర్ణాటక

65చూసినవారు
ఫుడ్ కలర్స్‌పై నిషేధం విధించిన కర్ణాటక
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదులు రావడంతో పలు కబాబ్ శాంపిల్స్‌ను పరిశీలించిన అనంతరం ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని నిషేధించింది. చికెన్, ఫిష్ కబాబ్, శాకాహార వంటకాల్లో వాడే కలర్లు ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని పేర్కొంది. వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్