BRS చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఫాంహౌజ్లో పగటి కలలు కంటుంటే.. కేటీఆర్ గెస్ట్హౌజ్లో పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు.
'ఏం చేశామని ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తారు? రూ.6.5 లక్షల కోట్లు అప్పు చేసినందుకా? లక్షల ప్రభుత్వ భూములను అమ్మినందుకా? పోలీసు రాజ్యం నడిపినందుకా? నిరంకుశ రాజ్యం నడిపినందుకా?' అని ప్రశ్నించారు.