లోక్సభ
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో BRS చీఫ్
కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఎర్రవల్లి ఫాం హౌజ్లో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ BRS ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ను గెలిపించాలని రాజయ్యకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు.