ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో ఆయనకు నిరాశ ఎదురైంది. దీనిపై శుక్రవారం విచారణలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్పై విచారణను జులై 17కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ను జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో జులై 12 వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.