ప్రధాని నరేంద్ర మోదీపై సెటైరికల్గా చేసిన ట్వీట్ను కేరళ కాంగ్రెస్ డిలీట్ చేసింది. ఆ ట్వీట్తో కాంగ్రెస్ పార్టీ క్రైస్తవులను అవమానించిందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే.సురేంద్రన్ అభిప్రాయపడ్డారు. పలువురు క్రైస్తవ నాయకులు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆ ట్వీట్ డిలీట్ చేసింది. ‘దీని వల్ల ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నాం’ అని ప్రకటించింది.