విమానంలో భోజనం చేస్తున్న ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. కాల్చిన చిలగడదుంప మరియు అంజూరపు చాట్లో బ్లేడ్ను పోలి ఉండే లోహపు ముక్కను గుర్తించాడు. ఈ ఘటన బెంగుళూరు నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్ళే ఎయిర్ ఇండియా విమానం AI 175లో ఇటీవల జరిగింది. ఆ చాట్ తింటుండగా కొన్ని సెకన్ల పాటు నమిలిన తర్వాతే ఆ లోహాన్ని గుర్తించానని తెలిపాడు. కానీ ఎటువంటి హాని జరగలేదని చెప్పాడు. సదరు ప్రయాణికుడు దీనికి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేయగా వైరలవుతున్నాయి.