నీట్ పీజీ 2024 పరీక్ష జులై లేదా ఆగస్టులో నిర్వహించవచ్చని తెలుస్తోంది. నీట్ యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలను దృష్టిలో ఉంచుకుని పీజీ పరీక్ష నిర్వహణకు ఎగ్జామినేషన్స్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరీక్షకు కేవలం 2 గంటల ముందు ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసి సెంటర్లకు పంపించాలని నిర్ణయించారట. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.