ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమ్స్..

65చూసినవారు
ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమ్స్..
ఖమ్మం రూరల్ మండలంలో ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పోన్నేకల్లో గల శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో మొత్తం 552 మంది అభ్యర్థులకు గాను 411 మంది పరీక్ష రాయగా, పెద్దతండాలోని ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో 490 మందికి 387 మంది హాజరయ్యారు. అలాగే సత్యనారాయణపురంలోని డేర్ ఇంజనీరింగ్ కళాశాలలో 504 మందికి గాను 389 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 115 మంది గైర్హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్