నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. మిడుతూరు మండలం చింతలపల్లిలో రోడ్డుపై వెళ్తున్న బస్సును గుర్తు తెలియని యువకులు ఆపి రెచ్చిపోయారు. బస్సు కండక్టర్పై దాడికి పాల్పడి పారిపోయారు. ఈ దాడిలో కండక్టర్కు గాయాలయ్యాయి. దాంతో అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.