మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్లో ఏడుగురు మహిళలకు స్థానం దక్కింది. నూతనంగా ఏర్పాటైన కేంద్ర కేబినెట్లో బీజేపీ ఎంపీలు నిర్మలా సీతారామన్, అన్నపూర్ణా దేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బంభానియా, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ ఉన్నారు. గత కేబినెట్లో మొత్తం 10 మంది మహిళా మంత్రులు ఉండేవారు.