ఖమ్మం: ఆరు గ్యారంటీలు అమలు చేయాలని వినూత్నంగా నిరసన

77చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను తక్షణమే అమలు చేయాలని సామాజిక కార్యకర్త ఎదురుగట్ల చిట్టిమల్లు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామంలో ఆకులు తింటూ వినూత్నంగా నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని చెప్పారు. మహిళలకు నెలకు రూ. 2, 500, రైతు భరోసా పెంపు, ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం వంటి పథకాలను అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్