నిర్జీవ ప్రదేశంలో సీతారామచంద్రస్వామి విగ్రహాలు

79చూసినవారు
ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం వెనుక శ్రీసీతారామచంద్రస్వామి సమేత లక్ష్మణ విగ్రహాలను పడేశారు. గత కొన్ని నెలలుగా విగ్రహాలు పడవేసి ఉండడంతో పలువురు రామభక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఆలయంలో పూజారులు పూజ చేస్తున్నప్పటికీ వెనకాల పడేసిన విగ్రహాలను మాత్రం పట్టించుకోవడం లేదు. వెంటనే ఆ విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్